కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  కోలుకోవాలని పూజలు

కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  కోలుకోవాలని పూజలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని  భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని శ్రీ అభయఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి  పేరుతో ప్రత్యేక అర్చన నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని  దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఏ సీ ఎస్ రాజు, రాష్ట్ర సీనియర్ నాయకులు ఎలగందుల చంద్రశేఖర్ ,  జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశీనాథo, సీనియర్ నాయకులు చందా సుగునకర్ రావు, గండ్ర ప్రవీణ్ రావు, షీలా గంగారాం, వనమాల సత్యనారాయణ, బండి సత్యనారాయణ, తూనికి అంజన్న, కొలుగురి ప్రసాద్ రావు, నరెందుల శ్రీనివాస్, బొందుకురి శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.