సూర్యాపేటకు పర్యాటక శోభ

సూర్యాపేటకు పర్యాటక శోభ

సూర్యాపేటకు పర్యాటక శోభ

షికారు బోటును ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : మినీ ట్యాన్క్ బండగా రూపాంతరం చెందిన సద్దుల చెరువులో షికారు బోటును రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ పుట్ట కిశోర్, రాష్ట్ర బి ఆర్ ఎస్ నాయకులు వై.వెంకటేశ్వర్లు,ఎస్ పి రాజేంద్రప్రసాద్,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హేమంత్ కేశవ్ పాటిల్,ఆర్ డి ఓ,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.సద్దుల చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడానికి తొలి అడుగు పడ్డట్లయింది. శుభాకార్యలు జరుపు కునేందుకు వీలుగా త్వరలో మినీ కృయిజ్ షిప్ ఫైబర్ జెట్ లను ఏర్పాటు చేసునున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.