మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం

మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం

సిరిసిల్ల పట్టణం- 32వ వార్డులో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం.

ముద్ర సిరిసిల్ల టౌన్: ఈరోజు స్థానిక 32వ వార్డులో కౌన్సిలర్ సభ్యులు సయ్యద్ సీమా బేగం అక్రం ఆధ్వర్యంలో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేలా కృషి చేస్తు ఈరోజు 32వార్డ్ లో దాదాపు 20 లక్షల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించి పురపాలక సంఘం ఆధ్వర్యం లో మహిళ కమ్యూనిటీ భవన్ నిర్మాణం చేపట్టాం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు ఆడెపు సౌజన్య మహేందర్, డి.ఈ ప్రసాద్, ఏ.ఈ వరుణ్, మాజీ కౌన్సిలర్ సభ్యులు సయ్యద్ తస్లీమ్, సయ్యద్ అక్రమ్ గారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.