హైదరాబాద్ లో పద్మశాలి భవన్ భూమి పూజ కార్యక్రమం
![హైదరాబాద్ లో పద్మశాలి భవన్ భూమి పూజ కార్యక్రమం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64720cc1b1709.jpg)
బయలుదేరిన సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రముఖులు:
ముద్ర సిరిసిల్ల టౌన్; ఈరోజు హైదరాబాద్ కోకపెట లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న పద్మశాలి ఆత్మ గౌరవ భవనం యొక్క భూమి పూజ కార్యక్రమం కు సిరిసిల్ల పట్టణం నుండి పద్మశాలి ప్రముఖులు బయలుదేరి వెళ్లారు. పట్టణం లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ, స్థానిక పద్మశాలి కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, పద్మశాలి సంఘ డైరెక్టర్లు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, ఇతర వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి కుల బాంధవులు తరలి వెళ్లారు.