పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ముద్ర, గంభీరావుపేట: 30 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. ఆదివారం  గంభీరావుపేట మండల కేంద్రంలో నీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన  విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. నేడు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం  ఎక్కడెక్కడ నివసిస్తున్న బాల్య స్నేహితులు అందరు  పాఠశాల, గూటికి చెరి   ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువతో ఘనంగా సన్మానించారు.  విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొంది. ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు.