బలగం నటుడిని పరామర్శించిన డైరెక్టర్ వేణు ఎల్దండి

బలగం నటుడిని పరామర్శించిన డైరెక్టర్ వేణు ఎల్దండి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన బలగం సినిమా నటుడు కీసరి నర్సింగం ను బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి పరామర్శించారు. గత కొంతకాలంగా నర్సింగం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బలగం సినిమాలో పంచాయతీ పెద్దగా.. సర్పంచ్ పాత్ర పోషించి అందరిని అలరించాడు. నర్సింగం ను పరామర్శించి బాగోగులు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. డైరెక్టర్ వేణు వెంట సినీ రచయితలు నాగరాజు, రమేష్ ఏలిగేటి, బలగం నటులు బాలు కాయితి సిరిసిల్ల ఉన్నారు.