ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి - ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేనిదీప వికాస్ రావు
![ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి - ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేనిదీప వికాస్ రావు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64130e45e3adf.jpg)
ముద్ర కోనరావుపేట :ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రతిమ పౌండేషన్ కృషి చేస్తుందని ప్రతిమ పౌండేషన్ చైర్మన్ చెన్నమనేని దీప వికాస్ రావు అన్నారు గురువారం మండలంలోని మామిడిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేశారు ఈ సందర్బంగా వికాస్ రావు మాట్లాడుతు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని గ్రామాల్లో ఉన్న ప్రజలకు తమ పౌండేషన్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అవసరం ఉన్న రోగులకు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామన్నరు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వికాస్ రావు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొక్కుల భారతి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు