ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలి- ఎస్పీ అఖిల్ మహాజన్

ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలి- ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల టౌన్, ముద్ర: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం మరియు పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై కఠినంగా వ్యవరించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల సేవించే వారిపై,  అలాగే అక్రమ వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి, పట్టుకుని జైలుక పంపించాలని సమన్వయ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సి.ఐ లు గులామ్ ముస్తఫా (సిరిసిల్ల), గుండేటి రాము (వేములవాడ), మరాఠీ పోష్ రాజ చంద్రశేఖర్ (ఎల్లారెడ్డి పేట) పాల్గొన్నారు.