పీఎం జన్ ఆరోగ్య యోజన నమోదు కార్యక్రమం ప్రారంభం

పీఎం జన్ ఆరోగ్య యోజన నమోదు కార్యక్రమం ప్రారంభం

ముద్ర, సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల కేంద్రం లోని 19వ వార్డ్ లో శనివారం  ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా  ఆయుష్మాన్ భారత్ పీఎం  జన్ ఆరోగ్య యోజన-ఈకేవైసీ నమోదు కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత వైద్యం ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమములో ఆరోగ్య మిత్ర నవీన్ కుమార్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.