ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలి

ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలి

ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలి:  సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీనివాస్

ముద్ర సిరిసిల్ల టౌన్; సిరిసిల్ల మున్సిపల్ ద్వారా ఒక్క రూపాయికే దహన సంస్కారాలను నిర్వహించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  మీడియా సమావేశంలో  శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే మంత్రి కేటీఆర్ కి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదు అన్నారు.

ఆర్థికంగా ఉన్నవారు అయితే దహన సంస్కారాల ఖర్చులు భరించగలరని , నిరుపేదలు వేయిల రూపాయల ఖర్చును ఎలా భరించగలరు అని ప్రశ్నించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని, అలాగే ఇక్కడ కూడా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహిస్తే నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు, వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.