ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలి
![ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64834901361c0.jpg)
ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలి: సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీనివాస్
ముద్ర సిరిసిల్ల టౌన్; సిరిసిల్ల మున్సిపల్ ద్వారా ఒక్క రూపాయికే దహన సంస్కారాలను నిర్వహించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే మంత్రి కేటీఆర్ కి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదు అన్నారు.
ఆర్థికంగా ఉన్నవారు అయితే దహన సంస్కారాల ఖర్చులు భరించగలరని , నిరుపేదలు వేయిల రూపాయల ఖర్చును ఎలా భరించగలరు అని ప్రశ్నించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని, అలాగే ఇక్కడ కూడా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహిస్తే నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు, వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.