ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

ముద్ర బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 313 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, మహానీయుని జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు గాను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. సర్వాయి పాపన్న చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సంబ లక్ష్మి రాజం, గుంటి శంకర్, పిట్టల రమేష్, ఉదారి నరసింహ చారి, గౌడ సంఘం నాయకులు నాగుల శ్రీనివాస్ గౌడ్, వికృతి ఆంజనేయులు, మెరుపుల గంగాధర్, కొండ కనకయ్య, నల్లగొండ అనిల్ కుమార్, బుర్ర తిరుపతి, బొలగం పర్శరాం, బుర్ర శేకర్, బుర్ర పర్షరాములు, చింతలకోటి మహేష్, చింతలకోటి రామస్వామి, పులి ప్రభాకర్, పులి పర్శరాములు, బాలసాని శ్రీనివాస్, ఉయ్యాల తిరుపతి, గంగిపెల్లి మొండయ్య తదితరులు పాల్గొన్నారు.