పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ఆవిష్కరణ

ఈనెల 8న కాన్షిరాం  విగ్రహవిష్కరణ
ముఖ్య అతిథిగా బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

భారీగా జన సమీకరణ : బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వరద వెళ్లి స్వామి గౌడ్

 ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం బిఎస్పి మండల అధ్యక్షులు అధ్యక్షులు నీరటి భాను ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన పితామహుడు రాజ్యాధికార ప్రదాత మాన్యవర్ కాన్షీరామ్ విగ్రహావిష్కరణ ఈనెల 8న  కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఉందని ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  బిఎస్పి జిల్లా  అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్ హాజరై మాట్లాడుతూ మాన్యవర్ కాన్షీరాం గారి విగ్రహావిష్కరణ కర్తగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నారని ఈ మండలం నుంచి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి యారపు రాజబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మాజీ ఎంపిటిసి తాటిపల్లి అంజన్న, ప్రముఖ న్యాయవాది రాజకుమార్, మండల ఉపాధ్యక్షులు నేల కంటి లక్ష్మీరాజ్యం, మండల కార్యదర్శి ఈశ్వర్, కిషన్, అజిత్,నెవూరి శ్రీనివాస్ రెడ్డి,భార్గవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.