బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
  • అధ్యక్షునిగా ఎలుసాని మోహన్ కుమార్
  • ఉపాధ్యక్షులుగా బంగారపు బాల్ రెడ్డి

ముద్ర,ఎల్లారెడ్డిపేట: బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది.ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి బుధవారం వ్యవసాయ మార్కెట్ భవనంలో ఉన్న ఛాంబర్ లో మొదటగా పూజ కార్యక్రమం నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక సమక్షంలో నిర్వహించారు.  అనంతరం సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఎలుసాని మోహన్ కుమార్,  ఉపాధ్యక్షులుగా బందారపు బాల్ రెడ్డి,  డైరెక్టర్లుగా గంట బాలగౌడ్, బద్దిపడిగే దేవేందర్ రెడ్డి, మండే శ్రీనివాస్, బండ సతీష్, సత్యం, అమున నాయక్, మేడిశెట్టి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, నర్సింహా రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి లను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎలుసాని మోహన్ కుమార్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అన్నదాతలకు అందుబాటులో ఉండి తన సేవలను అందిస్తానని రైతులకు వరి ధాన్యం సేకరణలో ముందుండి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన  బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, ఎంపీటీసీ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి,  సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి, చిదుగు గోవర్ధన్ గౌడ్, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్లు  బుగ్గ కృష్ణమూర్తి, జంగిడి సత్తయ్య, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్, జిల్లా సీనియర్ నాయకులు అందే సుభాష్, నంది కిషన్, మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా ఉన్నిసా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సీత్యా నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్,మాద ఉదయ్,గడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.