సిరిసిల్ల పట్టణం లో వ్యక్తి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం లో వ్యక్తి ఆత్మహత్య

ముద్ర సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్ కి చెందిన గుల్లె అనే రాము నేత కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి సిరిసిల్ల కి చెందిన సౌమ్య తో పెళ్లి అయి ఆరు సంవత్సరాలు అవుతుంది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా రాము తన నాన్నమ్మ దేవవ్వ నెహ్రూనగర్ లో అద్దెకి ఉంటున్న ఇంట్లో ఉంటున్నాడు. ఇదే క్రమంలో దేవవ్వ పొద్దున్న లేచి చూడగా బంగ్లా పై రాము ఉరి వేసుకుని కనపడ్డాడు. ఆత్మహత్య కి కుటుంబ కలహాలు లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.