ఆర్ సి ఓ ని సస్పెండ్ చేయాలని డిమండ్  - భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్

ఆర్ సి ఓ ని సస్పెండ్ చేయాలని డిమండ్  - భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్

ముద్ర,తంగళ్ళపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి మండలం ఇందిరమ్మ కాలనిలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల లో పుడ్ పయిజన్ వలన 24 మంది  విద్యార్థులు అస్వస్థత కు గురి కావడంతో భీం ఆర్మీ జిల్లా కమిటీ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు జిల్లా లోని  గురుకుల పాఠశాలలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న పట్టించుకొనే వారే లేక పోవడం సిగ్గు చేటు అని,  అధికారుల పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి పూర్తి బాధ్యతగా ఆర్ సి ఓ నీ సస్పెండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో శేకర్,ప్రేమ భాస్కర్,విజయ్,నిషన్,మహేశ్ తదితరులు పాల్గొన్నారు.