కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి: జెడ్పిటిసి

కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి: జెడ్పిటిసి

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు ను బుధవారం ప్రారంభించిన జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అంధత్వం లోపం ఉన్నవారు. అదేవిధంగా కంటి సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి వైద్యులచే పరీక్షలు చేయించుకొని కంటి అద్దాలు తీసుకోవాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  మునిగే అమృత దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి,  ఉపసర్పంచ్ బాలు, యాదవ సంఘం అధ్యక్షులు మండే శ్రీనివాస్ యాదవ్, పాలకవర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆశా ఏఎన్ఎం లు పాల్గొన్నారు.