గీత కార్మికుడి బలవన్మరణం
![గీత కార్మికుడి బలవన్మరణం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f836e76fd53.jpg)
సిరిసిల్ల టౌన్, ముద్ర: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ గీత కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన సిరిసిల్ల మున్సిపాలిటీలోని పెద్దూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దూరు లో బెజ్జారపు రమేష్ (45) కొంతకాలంగా వృత్తిపరమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో రమేష్ తీవ్రంగా మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య బాలామణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు