వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూపాలపల్లి క్యాంప్ కార్యాలయం పక్కన ఎమ్మెల్యే గండ్ర దంపతుల ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించారు.  ఇందులో  భాగంగా స్వామి వారికి  అభరణాలు  అలంకరంచారు.  ప్రత్యేక పూజలు చేశారు.