సెల్ ఫోన్ విషయంలో అక్క చెల్లెళ్ళ గొడవ అక్క ఆత్మహత్య రామన్న గూడెంలో విషాదం

సెల్ ఫోన్ విషయంలో అక్క చెల్లెళ్ళ గొడవ అక్క ఆత్మహత్య  రామన్న గూడెంలో విషాదం

ముద్ర న్యూస్ రేగొండ: సెల్ ఫోన్ విషయంలో అక్క చెల్లెళ్ళ మధ్య గొడవ జరిగి అక్క పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రేగొండ, మండలం రామన్న గూడెం, తండాలో గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రామన్న గూడెం,గ్రామానికి చెందిన, జగ్గు రవి కూతురు జగ్గు రమ్య(22) విద్యార్థిని గురువారం రోజు తన సెల్ ఫోన్ ఎక్కడో పోయిందని. తన సెల్ ఫోన్ జగ్గు రవి చెల్లెలి కూతురును అడుగగా తాను తియ్యలేదు నాకు తెలియదు అని చెప్పింది.ఐన జగ్గు రమ్య వినకుండా గొడవకు దిగింది.రవి నేను కొనిస్తాను గొడవ పడకండి అని చెప్పిన వినకుండా అవేశముతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తీసుకుని వచ్చి కుటుంబ సభ్యుల ముందే త్రాగడంతో. కుటుంబ సభ్యులు పరకాల సివిల్ హాస్పటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ తరలిస్తున్న క్రమంలో మార్గ మద్యంలో మృతి చెందినట్టు తెలిపారు.విషయం రేగొండ ఎస్ ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి కి సమాచారం అందించడంతో రమ్య తాత పిటిషన్ మేరకు కేసు నమోదు చేశారు..