కె టి ఆర్ జన్మదిన వేడుకలు దుమ్ము లేపిన అభిమానులు

కె టి ఆర్ జన్మదిన వేడుకలు దుమ్ము లేపిన అభిమానులు
  • రేగొండ మండల కేంద్రంలో భారీ ర్యాలీ

ముద్ర న్యూస్ రేగొండ:-తెలంగాణ రాష్ట్ర పురపాలన శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు  కల్వకుంట్ల తారక రామారావు  జన్మదిన వేడుకలను రేగొండ  మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే  గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు.సాంబారి సాయి కుమర్. రేగొండ మండల కేంద్రం చిట్యాల ప్రధాన రహదారి నుండి ఎస్ ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్ వరకు డప్పు చప్పుళ్లతో.కోలాటలతో,బారి ర్యాలీ నిర్వహించారు.పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

రేగొండ గోరికొత్త పల్లి. మండల ప్రజల పక్షాన కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసి, పెట్టుబడులను తీసుకు రావడంలో కేటీఆర్  ప్రత్యేక మార్క్ వేశారు.తండ్రి తగ్గ తనయుడిగా, భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న కే టీ రామారావు, మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర యువతకు రోల్ మడల్ గా నిలుస్తున్నారు. ప్రతి యువత కె టి రామారావు ను ఆదర్శంగా తీసుకోవాలని. అన్నారు. రాజకీయ్యంగా ఎదగాలంటే ఎన్నో ఒడి దుడుకులు ఎదుర్కోవాలని అన్ని అటు పోట్లకు ఓర్చుకొని ఎదగాలని అన్నారు.రేగొండ మండల కేంద్రంలో బాణా సంచా కాల్చి కెట్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  రేగొండ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, . గోరికొత్త పల్లి మండల అధ్యక్షులు మాటిక సంతోష్,. ఎంపీపీ పున్నం లక్ష్మి రవి,.జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, పి ఏ సి ఎస్ రేగొండ చైర్మన్ విజ్జాన్ రావు,  తెరాస సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ .రైతు బంధు జిల్లా కో ఆర్డినేటర్ హింగే మహేందర్,  కొలుగురి రాజేశ్వర్ రావు, రగుసాల తిరుపతి రావు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.