రోడ్డు విస్తరణ ఎంత? గ్రామానికో తీరా?

రోడ్డు విస్తరణ ఎంత? గ్రామానికో తీరా?
  • గ్రామపంచాయతీ తీర్మానం చేసిన పట్టించుకోని కాంట్రాక్టర్లు
  • డ్రైనేజీ కల్వర్టులు ఎటు సైడ్ వస్తాయి

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి టు సిరిసిల్ల హైవే ఫోర్ వే రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామపంచాయతీ 45 ఫీట్లకు అనుమతి ఇస్తే, సెస్ అధికారులు 40 ఫిట్లకి కరెంట్ లైన్ స్తంబాలు వేస్తున్నారు. అంటే పాత లైన్ కీ 2 ఫిట్లు తేడా వుంది. అన్ని గ్రామాల్లో లాగే ఇక్కడ కూడా 50 ఫీట్ రోడ్డు వెలయని గ్రామ ప్రజలు కోరుతున్నారు. లేని యెడల గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం 45 ఫిట్లు వెయాలని అధికారులను ఫోన్ లో సంప్రదిస్తే సరియైన సమాధానం ఇవ్వడం లేదని గ్రామస్తులు తెలియజేశారు.

ఇప్పుడు 40 ఫిట్లలో వేసిన కరెంట్ లైన్ మరి డ్రైనేజీ కల్వర్టులు ఎటు సైడ్ వస్తుందో స్పష్టత లేదు.ఒక్కవెల రోడ్డు సైడ్ వస్తె రోడ్డు 35 ఫీట్లు మాత్రమే అవుతుంది,అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అలాగే వస్తుంది.ఈ మాత్రం దానికి రోడ్డు విస్తరణ ఎందుకు? అని ప్రజలు చేర్చించు కుంటున్నారు.