అంతిమ సంస్కారానికి కైలాస రథాన్ని బహుకరించిన - మేడిద ఆదిరెడ్డి
![అంతిమ సంస్కారానికి కైలాస రథాన్ని బహుకరించిన - మేడిద ఆదిరెడ్డి](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a288e154fe2.jpg)
ఆదిరెడ్డిని అభినందించి.. సన్మానించిన గ్రామ సర్పంచ్ కోడారి సునీత రమేష్ యాదవ్
ముద్ర, మొగుళ్లపల్లి : మృతుల అంతిమ సంస్కారం నిర్వహించడానికి ఒక అపన్న హస్తం ముందుకు వచ్చింది. ఈ మేరకు కైలాస రథాన్ని గ్రామ పంచాయతీకి బహుకరించిన ఉదంతం సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మేడిద ఆదిరెడ్డి తన తండ్రి కీర్తిశేషులు మేడిద గట్టయ్య జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో కైలాస రథాన్ని చేయించారు. ఆ కైలాస రథంతో పాటు సంబంధిత కాగితాలను స్థానిక సర్పంచ్ కోడారి సునీత రమేష్ యాదవ్ కు అందజేశారు. గ్రామ పంచాయతీకి కైలాసరతాన్ని బహుకరించడం పట్ల గ్రామస్తులు ఆదిరెడ్డిని అభినందించారు. ఆదిరెడ్డిని గ్రామ సర్పంచ్ కోడారి సునిత రమేష్ యాదవ్ సన్మానించడం విశేషం.