సెమీకండక్టర్ రంగంలో హైదరాబాద్ నగరం ధే కీలక పాత్ర
- మైక్రోచిప్ టెక్నాలజీ, డెవలప్మెంట్ ఫెసిలిటీ కేంద్రంని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :-సెమీకండక్టర్ రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందని, ఆ ప్రక్రియలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించనున్నట్లు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని, బెంగళూరు చెన్నై ల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు.సోమవారం కోకాపేట్లోని వన్ గోల్డెన్ మైల్లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ను ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశానికి లైఫ్ సైన్సెస్ కాపిటల్ గా హైదరాబాదు ఉందని.. భారత్ లో అతిపెద్గ మెడికల్ డివైజ్ పార్క్ కూడా హైదరాబాద్ లోనే ఉందని వివరించారు. హైదరాబాద్ ను పోల్ పొసిషన్ తీసుకొచ్చేందుకు మెుబిలిటీ వ్యాలీ ను కూడా తీసుకొచ్చామమని, భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ అన్నారు. టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామమని, హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అని తెలిపారు. సెమీ కండక్టర్ రంగంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందని.. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు.
సెమీకండక్టర్ రంగంలో భారత్ తన వర్క్ఫోర్స్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందన్నారు. వచ్చే దశాబ్ధంలో ఆ రంగంలో భారత్ దూసుకెళ్తుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మందికి స్వంత ఖర్చులతో శిక్షణ ఇస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిలింగ్ రంగంలో కూడా తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉందన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్లో ఉందని వెల్లడించారు.
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో చాండ్లర్లో మైక్రోచిప్ టెక్నాలజీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. స్మార్ట్, కనెక్టడ్, సెక్యూర్ ఎంబెడ్ కంట్రోల్ సొల్యూషన్స్ ఆ కంపెనీ కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, కంప్యూటింగ్ మార్కెట్లకు చెందిన లక్షా 25వేల మంది కస్టమర్లకు ఆ కంపెనీ సేవల్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో మైక్రోచిప్ సంస్థ అధినేతలకు మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ తెలిపారు. ఈకార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, తధితరులు పాల్గొన్నారు.