మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ.50వేల చెక్కు అందజేత..

మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ.50వేల చెక్కు అందజేత..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల  అనారోగ్యంతో మృతి చెందిన అమలి  విశ్వనాథం కుటుంబానికి  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి గురువారం రూ.50 వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మృతి చెందిన హోంగార్డు  కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని అన్నారు. శాఖ పరంగా రావలసిన ప్రయోజనాలన్నీ వచ్చేలా చూస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ సురేందర్ రెడ్డి,  సిసి ఫసియొద్దిన్ పాల్గొన్నారు