జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా..: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా..: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఇటీవలె నూతనంగా నియామకమైన భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటీ, బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కమిటీల సభ్యులు ఆదివారం ఎమ్మెల్యేను భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో  సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం జర్నలిస్టు సంఘాల నేతలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారా నికి తప్పకుండా కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ ను జర్నలిస్టు నేతలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ కన్వీనర్ నాగపూరి శ్రీనివాస్ గౌడ్, కో- కన్వీనర్లు ఆరెల్లి నరేందర్, బెల్లం తిరుపతి, జల్దీ రమేష్, కొల్లోజు రంజిత్, సామల శ్రీనివాస్, ఎడ్ల సంతోష్, పాలకుర్తి మధు, ఏస్సి, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల సంపత్, కోశాధికారి కడపాక రవి, బీసీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు సామల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పావుశెట్టి శ్రీనివాస్, కోశాధికారి పసుపుల రాజు, గౌరవ అధ్యక్షులు అడ్డగట్ల శ్రీధర్, నాయకులు సతీష్, వలి తదితరులు పాల్గొన్నారు.