బావమరిదే హంతకుడు
![బావమరిదే హంతకుడు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64455593555b0.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం పెద్ద బజార్లో జరిగిన హత్య కేసును పట్టణ పోలీసులు చేదించారు. ఆస్థి కోసం బావను బావమరిది హత్య చేశాడు. టౌన్ ఇన్స్పెక్టర్ సంజయ్ కథనం ప్రకారం మెదక్ పట్టణం గాంధీనగర్ కు చెందిన పొట్టిపల్లి శ్రీనివాస్ (52)ను బావమరిది సోములవారి సంతోష్ (39) హత్య చేసినట్లు పట్టణ తెలిపారు. తన తండ్రి నుంచి దక్కాల్సిన ఆస్తికి అడ్డుపడుతున్నారని కక్షతో సొంత బావను కుట్టుమిషన్ రిపేర్ షాప్లో మద్యం తాగించి హత్య చేసినట్లు వివరించారు. నిందితుడు సంతోషన్ను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.