ఎమ్మెల్యే పద్మకు మంగళహారతులతో స్వాగతం

ఎమ్మెల్యే పద్మకు మంగళహారతులతో స్వాగతం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎం. పద్మదేవేందర్ రెడ్డి శుక్రవారం  చిన్నశంకరంపెట్ మండలం ఖాజాపూర్ తండా ఖాజాపూర్, రామాయపల్లి, శాలిపేట్, చెన్నాయిపల్లి, వెంకట్రావుపల్లి, మడూరులో  ప్రచారం నిర్వహించారు. ఉరూర, గిరిజన తండాల్లో మంగళహారతులతో స్వాగతం పలికారు.తెలంగాణ ఉద్యమ నాయకురాలు పద్మక్కను మళ్ళీ గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. గడిచిన 9 ఏళ్లలో మెదక్ అభివృద్ధి చెందింది,  మరింత అభివృద్ధి జరగాలంటే పద్మక్కే రావాలని గెలవాలన్నారు. మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.