లారీ ఢీ.. బైక్ పై ఉన్న వ్యక్తి మృతి | Mudra News

లారీ ఢీ.. బైక్ పై ఉన్న వ్యక్తి మృతి | Mudra News

ముద్ర ప్రతినిధి, మెదక్: లారీ ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణం ఆటో నగర్ మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు పట్టణంలోని నర్సిఖేడ్ కు చెందిన తూర్పు ఆంజనేయులు గౌడ్(50) గా గుర్తించారు. మృతుడు ఆంజనేయులు గౌడ్ బైక్ లో పెట్రోల్ పోయించుకుని ఎందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గంగినేని థియేటర్ వద్ద మిషన్ భగీరథ మ్యాన్ హోల్స్ కారణంగా బైక్ టైరు ఇరుక్కొని పడడంతో లారీ తలపై నుండి  వెళ్ళింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి ఫతేనగర్ కు చెందిన సురై శ్రీనివాస్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు