వైభవంగా బోనాల పండుగ

వైభవంగా బోనాల పండుగ

మెదక్ లో బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్: అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నల్ల పోచమ్మ, మాత బోరంచమ్మ తల్లి బోనాల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి రాందాస్ చౌరస్తాలో మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని అమ్మవారికి  సమర్పించారు. అనంతరం నల్ల పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో పాడి పంటలతో రైతులు అభివృద్ధి చెందాలని కోరారు.

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, కేసీఆర్ మూడవసారి సీఎం ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.వేలాది మంది మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజుల నృత్యాలు, యువకుల కేరింతలతో ఉత్సాహభరితంగా, పండుగ వాతావరణంలో బోనాల ఉత్సవం ముందుకు సాగింది.  సాయంత్రం మాత బోరంచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ అధ్యక్షులు సున్నం నరేష్, నాయకులు లింగారెడ్డి పాల్గొన్నారు.

సికింద్రాబాద్ లో .. 
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మెదక్ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి మెదక్ నియోజకవర్గం ప్రజల పక్షాన పట్టువస్త్రాలను సమర్పించారు. ఇన్సూరెన్స్ చెక్ అందజేత పాపన్నపేట మండలం నామాపూర్ తండాకు చెందిన చెందిన కాట్రోత్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించగా కుటుంబానికి  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రెండు లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేశారు.