రాఖీ కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు.. రోడ్డు ప్రమాదంలో మృతి వివాహమైన పక్షం రోజులకే మృత్యువాత

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేటకు చెందిన అశోక్ అనే యువకుడికి గత 15 రోజుల క్రితం వివాహమైంది. తన భార్యతో కలిసి అత్తవారింటికి రాఖీ కట్టడం కోసం వచ్చాడు. అశోక్ శుక్రవారం ఉదయం పెట్రోల్ పోసుకొని తిరిగి వెళుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేస్తు జాతీయ రహదారిపై బాధితులు రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోతో వాహనాలు కిలోమీటర్ మేరా నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.