రామప్ప గుట్టను సందర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి
![రామప్ప గుట్టను సందర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645dd5fbe3c1c.jpg)
తూప్రాన్ ముద్ర: తూప్రాన్ మండల పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామ పరిధిలోని రామప్ప గుట్టపైన నూతనంగా నిర్మించిన రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. వేద పండితులు, నిర్వాహకులు స్వాగతం పలికారు. సీతా రామ, లక్ష్మణ, హనుమాన్ విగ్రహ ప్రతిష్ట పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.