మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం టీచర్ దంపతుల దుర్మరణం
![మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం టీచర్ దంపతుల దుర్మరణం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645dbe1b442b9.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం జరిగింది. డీసీఎం వ్యాన్ బైక్ ను ఢీకొనగా బైక్ పై వెళ్తున్న టీచర్ రవి దంపతులు మృతి చెందారు. పోలీసులు చేరుకున్నారు. మృతుడు నునావత్ రవి చిలప్ చెడ్ మండలం రహింగూడ తండాగా గుర్తించారు. రవి శివంపేట మండలం పిల్లుట్లలో టీచర్ గా పనిచేస్తున్నారు. బార్య అమృత గృహిణి.