సువిద్య కాలేజీలో బతుకమ్మ సంబురాలు..

సువిద్య కాలేజీలో బతుకమ్మ సంబురాలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:చిట్యాల మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు బుధవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో సంప్రదాయకరమైన, ఆజపడుచులకు ఏంతో ప్రీతివంతమైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని స్థానిక కాలేజీ విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయకంగా ఆటలు ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కందికొండ రాజు, కళాశాల ఇంచార్జి నోముల వేణు, అధ్యాపకులు దూడపాక సంతోష్, నోముల ప్రీతం, లోకేందర్ రెడ్డి, సాంబయ్య, రంజిత్, ఝాన్సీ, శ్రీవిద్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.