ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పనులు ప్రారంభం.

ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పనులు ప్రారంభం.
  • సర్పంచ్ అన్నెంశిరీష కొండారెడ్డి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ ను సోమవారం సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి   హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో  అభివృద్ధి చేస్తూ  ముందుకెళ్తున్నారని అన్నారు.కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ఏఈ గడుసు జితేందర్ రెడ్డి, కాంట్రాక్టర్ దేవరం బాలకృష్ణ, అనిల్ ,పలువురు వార్డు సభ్యులు ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.