ప్రమాణ స్వీకారం చేసిన అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ సభ్యులు
![ప్రమాణ స్వీకారం చేసిన అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ సభ్యులు](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f2e18302492.jpg)
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: శబరినగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయం నూతన కమిటీ సభ్యులు శనివారం ఉదయం ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షులు వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన అధ్యక్షులు బెలిదె శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ఠ ను పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని, పారదర్శకంగా పనిచేసి, ప్రతి రూపాయి జమ ఖర్చులు ప్రతి నెల కమిటీ సభ్యులకు, భక్తులకు తెలియజేస్తామని అన్నారు. ఆలయ పరిరక్షణ కోసం అంకితమవుతామని వారు ప్రమాణం చేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు సన్నిహితులు, భక్తులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు ఆలయం బాధ్యతలు అప్పగించారు.
అయ్యప్ప స్వామి దేవాలయం సూర్యాపేట నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
- అధ్యక్షులు : బెలిదె శ్రీనివాసులు
- ఉపాధ్యక్షులు : భూపతి శ్రీనివాస్
- ప్రధాన కార్యదర్శి : ఎల్గూరి రాంబాబు గౌడ్
- సహాయ కార్యదర్శి : మారం వెంకటేశ్వర రావు (జెపిటి)
- సంయుక్త కార్యదర్శి : బూర్ల మధుసూదన్
- కోశాధికారి : బచ్చు శ్రీనివాస్
కార్యవర్గ సభ్యులు
- పోలా రాధాకృష్ణ
- పాల్వాయి రవీందర్
- మిర్యాల సంపత్ కుమార్
- జటంగి రవి
క్రమశిక్షణ, ఇంటర్నల్ ఆడిట్ కమిటీ
- మట్టపల్లి రాధాకృష్ణ
- ఓరుగంటి సూర్యనారాయణ
- శ్రీపాద భాస్కరాచారి ప్రమాణ స్వీకారం చేశారు.