దళిత బిడ్డ పై సామూహిక అత్యాచారం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

దళిత బిడ్డ పై సామూహిక అత్యాచారం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
  • శాంతియుత ధర్నా చేస్తున్న బిఎస్పి నాయకులను పోలీస్ స్టేషన్ కి తరలింపు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుతంగా సూర్యాపేట పట్టణం లో అంబేద్కర్ చౌరస్తా  దగ్గర ధర్నా చేస్తున్న సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు గట్టు గోపి, బిఎస్పి నాయకులను అక్రమంగా పోలీసులు తమను పోలీస్ స్టేషన్ కీ తరలించడం జరిగిందనీ,దీనిని నిరసిస్తూ అధ్యక్షుడు గట్టు గోపి మాట్లాడారు .ఇటీవల జరిగిన హైదరాబాద్ లో ఒక దళిత బిడ్డపై సామూహిక హత్యాచారం చేయబడిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేస్తున్న క్రమంలో  ఇలా అక్రమ అరెస్ట్ లు ఎంతవరకు నిరంకుశ పాలన నాంది పలుకుతుందన్నారు.ఈ సమాజంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతే అరెస్ట్ లు   చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లక్కపాక సైదులు,నాయకులను అక్రమ అరెస్ట్ చెయ్యడం జరిగిందన్నారు.