ఆలేరులో తారక రామారావు పుట్టినరోజు సంబరాలు..

ఆలేరులో తారక రామారావు పుట్టినరోజు సంబరాలు..

ఆలేరు (ముద్ర న్యూస్):బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఆలేరు మున్సిపల్ కేంద్రం నుండి సాయి గూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా హరితహారం లో మొక్కలను నాటారు. ప్రముఖ ఎన్నారై తేజ చింతకాయల. శోభ ఆంజనేయులు చేస్తున్న సేవ కార్యక్రమాలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ఫిక్స్డ్ అమౌంటు డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య. మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్. వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్ తో పాటు ఎన్నారై తేజ చింతకాయల స్ఫూర్తి. పుట్ట పవన్. బండి శ్రీనివాస్, బి వెంకటేష్ ఎండి అంజాద్. మైల శ్రీశైలం తో పాటు స్థానిక సంస్థల ప్రజా మున్సిపల్ మార్కెట్ కమిటీ బిఆర్ఎస్ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.