బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు - యరగాని నాగన్న గౌడ్

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు - యరగాని నాగన్న గౌడ్

హుజూర్ నగర్, టౌన్, ముద్ర: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ రాజకీయాలలోపీవీ నరసింహారావు పాత్ర చాలా గొప్పదని, ఆయన బహు భాషా కోవిదుడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడని, తన భూమిని పేద ప్రజల కోసం విరాళంగా ఇచ్చాడని అన్నారు.  కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వాములశివారెడ్డి, గిరిబాబు, కౌన్సిలర్ కసాల శ్రావణ్ ,కోలమట్టయ్య, చింతకాయల రాము, జక్కుల మల్లయ్య ,ఇట్టి మల్ల బెంజిమెన్ , సమ్మెట సుబ్బరాజు పాల్గొన్నారు.