జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి

వైయస్సార్ సిపి తెలంగాణ అధికార ప్రతినిధి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పిట్ట రాంరెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట :జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్ట రామిరెడ్డి తెలిపారు. గత కొద్దిరోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని కోరుతూ నిరవధిక నిరసన కార్యక్రమం చేస్తున్న సంగతి విదితమే. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.

గత నాలుగు సంవత్సరాల క్రితం 9350 మందిని మూడేళ్లు కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించారని, అవసరాన్ని బట్టి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. మూడేళ్ల సర్వీస్ కు అదనంగా ఒక ఏడాది సర్వీస్ పెంచి నాలుగేళ్లు పని పూర్తి చేసుకున్నారు అని తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. లేనిచో పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..