ఆపత్కాల సమయంలో.. అక్కున చేర్చుకుని

ఆపత్కాల సమయంలో.. అక్కున చేర్చుకుని
  • పేదింటి విద్యా కుసుమానికి మంత్రి జగదీష్ రెడ్డి చేయూత
  • ఆర్థిక సహాయం  అందించి విద్యార్దిని ఇంజనీరింగ్   కలను సాకారం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
  •  మంత్రి ఔదార్యం తో బీటెక్ సిఎస్సి విభాగం లో చేరిక
  • సరస్వతి పుత్రిక కళ్ళ లో అనందం నింపిన మంత్రి 

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సమయం  రాత్రి పది గంటలు.. మరో రెండు గంటలు మాత్రమే గడువు. డబ్బులు తీసుకొస్తామని వెళ్ళిన తల్లిదండ్రులు అటే వెళ్లారు. వారు వస్తారని ఆశ లేదు.. సమయం గడుస్తున్నా కొద్దీ.. తాను బీటెక్ చదవాలనుకున్న కోరిక  నేరెవెరేలా లేదు. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి.

సరిగ్గా అదే సమయంలో మేన మామ లా తన లాంటి ఎంతో మందిని అక్కున చేర్చుకున్న సూర్యాపేట శాససభ్యులు జగదీష్ మామ గుర్తుకు వచ్చి, తన బంధువు సహాయంతో సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం కు చేరుకుంది నామవరం కు చెందిన ప్రవీణ. విద్యార్దిని ముఖం లో ఆందోళనను గమించిన మంత్రి విద్యార్దిని వాకబు చేశారు.. బీటెక్ చదవడానికి అన్ లైన్ ఫీజ్ చెలించే గడువు మరో రెండు గంటలు మాత్రమే ఉందని తెలుసుకుని  హుటహుటిన  అడ్మిషన్  కన్ఫర్మేషన్ కోసం చెల్లించాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందజేసి విద్యార్థిని తన భవిష్యత్ పై పెట్టుకున్న ఆశలను సజీవంగా ఉంచారు .పేదరికం లో  ఇంజనీరింగ్ విద్యను చదువుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్న బాలిక కుఅండగా నిలిచారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఇంజనీరింగ్ చదువాలనుకున్న అమె కలను సాకారం చేశారు. 

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట  జిల్లా మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన ప్రవీణ ఇంటర్మీడియట్‌లో ప్రధమ శ్రేణి మార్కులతో  సూర్యాపేట లోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్  సైన్స్ విభాగం లో సీటు సాధించింది. కానీ  ప్రవీణ తండ్రి సైదాచారి, తల్లీ విజయ లు పేదవారు కావడంతో ఫీజులు ఎలా చెల్లించాలో వారికి అర్థం కాలేదు. అప్పు  కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.తనను  కలిసిన బాలిక పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి గుంటకండ్ల జగదీరెడ్డి చేయూత అందించారు.ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు . అన్ని విధాల అండగా ఉంటానని, బాగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని సూచించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేయూతతో తన ఇంజినీరింగ్ ఆశ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు ప్రవీణ ఆమె బంధువులు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి తమ వంతు సేవ చేస్తామని అన్నారు.