TSPSC Paper Leak టిఎస్ పిఎస్ సి  పేపర్  లీక్ ఫై జగిత్యాలలో బిజెపి నిరసన దీక్ష

TSPSC Paper Leak టిఎస్ పిఎస్ సి  పేపర్  లీక్ ఫై జగిత్యాలలో బిజెపి నిరసన దీక్ష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: టిఎస్ పిఎస్ సి పేపర్  లీకేజీలో బాధ్యుడు ఆయన కేటిఆర్ ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని, టిఎస్ పిఎస్ సి ని వెంటనే రద్దు చేసి గ్రూప్1 అభ్యర్థులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండు చేస్తూ జగిత్యాల పట్టణంలోని  తాసిల్ చౌరస్తా వద్ద బిజెపి అధ్వర్యంలో ఓక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షాలో పాల్గొన్నజిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విడుదల చేసినా ఒకే ఒక్క గ్రూప్1 నోటిఫికేషన్ అని.. ఆ నోటిఫికేషన్లో అవకతవకలు జరిగాయని  దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎజెండా నీళ్లు నిధులు నియామకాలు అన్నారని మరి అలాంటి నియామకాల్లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయన్నారు. 2014 ఎలక్షన్లో కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత  లక్షా 20వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఎక్కడ భర్తీ చేసారో చెప్పాలని ప్రశ్నించారు. ఖాలిగా ఉన్న పోస్టులును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, పట్టణ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ, ఓబిసి  మోర్చా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, రాంరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, ఎండబెట్ల వరుణ్‌కుమార్, బద్దేల గంగరాజం తదితరులు పాల్గొన్నారు.