మొలకలు-నారు
![మొలకలు-నారు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6451388128eee.jpg)
ముద్ర, మల్యాల: ఆరుకాలం శ్రమించి పండిoచిన పంట అకాల వర్షాలకు నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళవారం మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని కొనుగోలు కేంద్రంలో పలువురి వరి ధాన్యం మొలకలు రాగ, ఓ రైతు ధాన్యం కుప్ప వద్ద వడ్లు కొట్టుకుపోయి నారు మొలిసింది. ఇది ఇలా ఉండగా, అకాలవర్షాల కారణంగా తమ ఎకరoన్నరా వరిపంట పూర్తిగా నీళ్లపాలైoదని మల్యాలకు చెందిన ఓ మహిళా రైతు అక్కడికి వచ్చిన బీజేపీ చెప్పుకుంటూ.. కన్నీరుమున్నీరైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరింది.