మొలకలు-నారు

మొలకలు-నారు

ముద్ర, మల్యాల: ఆరుకాలం శ్రమించి పండిoచిన పంట అకాల వర్షాలకు నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళవారం మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని కొనుగోలు కేంద్రంలో పలువురి వరి ధాన్యం మొలకలు రాగ, ఓ రైతు ధాన్యం కుప్ప వద్ద వడ్లు కొట్టుకుపోయి నారు మొలిసింది. ఇది ఇలా ఉండగా, అకాలవర్షాల కారణంగా తమ ఎకరoన్నరా వరిపంట పూర్తిగా నీళ్లపాలైoదని మల్యాలకు చెందిన ఓ మహిళా రైతు అక్కడికి వచ్చిన బీజేపీ చెప్పుకుంటూ.. కన్నీరుమున్నీరైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరింది.