ఉద్యోగులకు బదిలీలు సహజం

ఉద్యోగులకు బదిలీలు సహజం
  • ప్రతి చోట అంకితభావంతో పనిచేయాలి: జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ : ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజమని జనగామ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. జనగామలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేసి కరీంనగర్ కు బదిలీపై వెళ్తున్న ప్రపుల్ దేశాయ్ కు శుక్రవారం ఆత్మీయ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో బదిలీలు సహజమని, తాము పని చేసే చోట అంకితభావంతో పనిచేసి అధికారులు, ప్రజల మన్ననాలు పొందాలని సూచించారు.

ప్రపుల్ దేశాయ్ జిల్లాలో చాలా తక్కువ కాలం పనిచేసినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాని, భవిష్యత్తులో విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పటికీ జనగామను మరచిపోనన్నారు. జిల్లాలో ప్రతి విభాగం నుంచి అధికారులు అందరూ సహకరించారన్నారు. సభలో పాల్గొన్న కలెక్టర్ రోహిత్ సింగ్, (రెవెన్యూ), డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, డీపీఓ రంగాచారి, జెడ్పిసిఓ వసంత, స్టేషన్ ఘన్ పూర్, జనగామ ఆర్డీవోలు సుహాసిని, మురళీకృష్ణ, జిల్లా అధికారులు, టీజీవో టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.