భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే రాజయ్య

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మత సామరస్యానికి, స్నేహం, జాలి, దయ లకు ప్రతీక రంజాన్ పండుగను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంలోని ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు తాటికొండ, కొత్తపల్లి, వెంకటాద్రి పేట గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.