చలివేంద్రం ప్రారంభం

చలివేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని  సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రఘుపతి  శనివారం ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. వీలైనంత వరకు పట్టణంలోని అన్ని ఏరియాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగరాజు, పోలీసులు నాయకులు, పాల్గొన్నారు.