ఎన్నికలను విజయవంతం చేద్దాం రిటర్నింగ్ అధికారి

ఎన్నికలను విజయవంతం చేద్దాం రిటర్నింగ్ అధికారి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: సమిష్టి కృషితో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విజయవంతం చేద్దామని ఆర్డిఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం రామ్మూర్తి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం లోని నందలి బిఎల్ఓలు, సూపర్ వైజర్లకు ఎన్నికల నిర్వహణ పై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పోలింగ్ కేంద్రం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, లొకేషన్ వివరములు సరి చూసుకోవాలన్నారు. గ్రామం నుండి శాస్వతంగా వెళ్లి పోయిన, డబుల్ పేర్ల నమోదు, మరణించిన ఓటర్ల తొలగింపు, 80 సంవత్సారాలు దాటిన వారి వివరాలు 40% అంగ వైకల్యం ఉన్న ఓటర్లు అందరికీ 12(D) ఫారాలు పంపిణీ చేయాల న్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారుల సూచనలు తుచా తప్పకుండా పాటించి ఎన్నికలు విజయ వంతంగా పూర్తి చేయుటకు సమిష్టిగా పని చేయాలని తెలియ చేసినారు. ఈ సదస్సులో తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు చిల్పుర్, జాఫర్గడ్, వెలర్, ధర్మ సాగర్, రఘునాథ పల్లి, కాజీపేట, ఐనవోలు, లింగాల ఘనపూర్ తహశీల్దార్ లు, సూపర్వైజర్ లు బిఎల్ఒ లు పాల్గొన్నారు.