16న సీఎం కేసీఆర్ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ళ
ముద్ర ప్రతినిధి భువనగిరి :ఈ నెల 16న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ జరిగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారని ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు నాయకులకు సూచనలు చేశారు. వాహనాలు నిలుపు స్థలము, నీటి సౌకర్యం పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నపోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు పెంట నితీష్, రహీం, శ్రేణులు పాల్గొన్నారు.