కాంగ్రెస్ జెండా ఎగర వేయాలి

కాంగ్రెస్ జెండా ఎగర వేయాలి

ముద్ర. స్టేషన్ ఘన్ పూర్: ఇందిరక్కను గెలిపించి స్టేషన్ ఘన్ పూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగర వేసేందుకు కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పని చేయాలని బీసీ సెల్ జిల్లా నాయకులు తాటికొండ సంపత్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో సోమవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్లు అధికారంలో ఉండి టిఆర్ఎస్ నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. ఈ ఎన్నికల్లో సింగపురం ఇందిరను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యకులు చొక్కమ్ శ్రీను, ప్రతాపగిరి మల్లేశం, పండుగ నర్సయ్య, చొక్కమ్ రాములు, నల్ల రాజయ్య, నీల రమేష్, పర్శ రాములు, ముస్లిం మైనారిటీ నాయకులు అక్బర్, అజాం,లాలూ రమేష్, గోషికొండ వెంకటేష్, ఎడమ రవి, బొంగోని రాజు, నారబోయిన సతీష్, ఈర్ల  రవి, యార రాజారామ్, నారాబోయిన శివ, చింతపండు సూరి, ఈర్ల అనిల్ నారదాసు సాగర్, యార కుమార్ చింతపండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.