దళిత బంధు యూనిట్ల పరిశీలన

దళిత బంధు యూనిట్ల పరిశీలన

ముద్ర ప్రతినిధి, జనగామ : దళిత బంధు యూనిట్లను పరిశీలించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకన్న తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం దళితుల ఆర్థిక అభివృద్ధియే ధ్యేయంగా ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన యూనిట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించడం జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్.వెంకన్న చెప్పారు. బుధవారం నాడు పాలకుర్తి నియోజకవర్గం లోని తీగారంలో క్షేత్రస్థాయిలో ట్రాక్టర్, హార్వెస్టర్, ట్రాలీ ఆటో, కాంక్రీట్ మిషన్స్, సామాగ్రి, డైరీ ఫామ్, జాన్ డియర్, వరీ కోత మిషన్స్, లింగాల గణపురం మండలం నెల్లుట్ల , గ్రామాల్లో యూనిట్లను పరిశీలించారు.