అధికారంలోకి వస్తుంది... గ్యారెంటీలను ఇస్తుంది: కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర

అధికారంలోకి వస్తుంది... గ్యారెంటీలను ఇస్తుంది: కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 8 గ్యారెంటీలను అమలు చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా చిల్పుర్ మండలం చిన్న పెండ్యాల, తీగల తండా, వాచ్య తండా, వెంకటేశ్వర పల్లె లో రచ్చబండ కార్యక్రమంలో ఇందిర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్ కొత్త జిల్లాలు, కొత్త మండలాలు కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి కనీసం మౌలిక సదుపాయాలను కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అన్నారు.

ప్రతి గ్రామానికి విద్యా వైద్యం మరియు రవాణా సౌకర్యాలు లాంటివి కలిపించ లేనటువంటి దుర్మార్గమైన పదేళ్ల కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. డబుల్ బెడ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బందు మొదలైన మాయమాటలు చెప్పుకుంటూ మరో మారు అధికారం వచ్చేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పనుతుందన్నారు. పేదలందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపు ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీద సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రచార కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు మహిళలు పాల్గొన్నారు.